తొలి వ‌న్డే.. సెంచ‌రీ చేసిన రోహిత్ శ‌ర్మ‌

229
Rohit Century
- Advertisement -

సిడ్నీ లో భార‌త్ ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌ర‌గుతున్న మొద‌టి వ‌న్డేలో టీంఇండియా ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేశాడు. 110 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేశాడు. మొత్తం 4సిక్స్ లు, 7 ఫోర్ల‌తో నిధానంగా ఆడుతున్నాడు. ఆసీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 289ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇండియా ఆట‌గాళ్ల‌కు మొద‌ట్లోనే కీల‌క వికెట్ల‌ను కొల్లోయింది.

ఓపెన‌ర్ ధావ‌న్, అంబ‌టి రాయుడు డ‌కౌట్ కాగా, విరాట్ కోహ్లి మూడు ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ధోని, రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి నిధానంగా ఆడుతూ ప‌రుగులు చేస్తున్నారు. 51 పరుగులు పూర్తి చేసిన ధోని బెహ్రెన్డెర్ఫ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్ సన్ 3 వికెట్లు తీయగా, బెహ్రెన్డెర్ఫ్ రెండు వికెట్లని పడగొట్టాడు.

- Advertisement -