వెనిజులాలో ప్ర‌మాదం.. 23 మంది మృతి

6
- Advertisement -

వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉండగా ఆంగోస్తురా మునిసిపాలిటీలో ఈ ప్రమాదం జరిగిన‌ట్లు అధికారులు తెలిపారు. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సహాయక చర్యలను వేగవంతం చేయాలని వెనిజులా ప్రెసిడెంట్ నికోల‌స్ మ‌దురో తెలిపారు. శిథిలాల కింద ఉన్న‌వారిని గుర్తించి, ర‌క్షించాల‌న్నారు. సివిల్ డిఫెన్స్ బృందాలను ఇప్ప‌టికే పంపామ‌ని తెలిపారు.

Also Read:BJP:ఓటమి ఉచ్చులో ఆ ముగ్గురు!

- Advertisement -