Trisha:అసలు ‘త్రిష’కే ఎందుకు ఇలా?

15
- Advertisement -

హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే నేత ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు మొత్తం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ, ఏవీ రాజు ఏం మాట్లాడాడు అంటే.. ‘గౌవత్తూరులోని ఓ కార్యక్రమానికి గతంలో త్రిష హాజరవ్వగా ఎమ్మెల్యే వెంకటాచలం ఆమెపై మనసు పారేసుకున్నారు. దీంతో ఆమెకు రూ.25 లక్షలు చెల్లించి ఒకరోజు గడిపారు. దీనికి నేనే సాక్ష్యం.’ అని కామెంట్ చేశారు.

దీనిపై త్రిష స్పందించి అతడిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. పైగా అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు పై హీరోయిన్‌ త్రిష కేసు కూడా పెట్టింది. తన పై అసభ్యకర కామెంట్స్ చేసి తన పరువు తీశారు అంటూ త్రిష ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఏవీ రాజు త్రిషకు క్షమాపణలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరివైనా మనోభావాలు దెబ్బతిన్నట్టయితే, తనను క్షమించాలని కోరారు. మొత్తానికి హీరోయిన్‌ త్రిష కు ఏవీ రాజు క్షమాపణలు చెప్పాడు.

అన్నట్టు, త్రిష మరో కేసులో కూడా పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు వ్యక్తులు తన పేరుతో మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని, తన పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను ప్రారంభించారని చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులకు త్రిష ఫిర్యాదు చేసింది. మొత్తానికి ఫామ్ లోకి వచ్చినా.. త్రిష కి ఆ సంతోషాన్ని లేకుండా చేస్తున్నారు. అసలు త్రిష కే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read:గంజాయి కేసులో బిగ్ బాస్ షణ్ముఖ్ అరెస్ట్..

- Advertisement -