రూ.2 కోసం యువకుడి హత్య

400
murder
- Advertisement -

తూర్పు గోదావరి జాల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.2 ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వలసపాకలలో ఈఘటన చోటుచేసుకుంది. వలసపాకలో ఓ సైకిల్‌ షాపులో సువర్ణరాజు అనే యువకుడు గాలి కొట్టించుకున్నాడు. అనంతరం రెండు రూపాయల కోసం షాపు యజమాని సాంబతో గొడవపడ్డాడు.

ఇద్దరి మధ్య గోడవ తీవ్ర స్ధాయికి చేరడంతో యాజమాని సాంబపై సువర్ణరాజు చేయి చేసుకున్నాడు. ఈ సమయంలో సాంబ పక్కనే ఉన్న అతని స్నేహితుడు అప్పారావు ఆగ్రహంతో ఊగిపోయాడు. అక్కడున్న కత్తితో సువర్ణరాజును పొడిచాడు. వెంటనే స్థానికులు సువర్ణ రాజును కాకినాడలోని జీజీహెచ్ హాస్పిటల్ కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -