చంద్రబాబు…సిగ్గుమాలిన వ్యక్తి

83
srikanth reddy
- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని…సొంత పార్టీ ని కాపాడుకోలేక వికృత క్రీడలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

40 ఏళ్ల చరిత్ర అని చెప్పే చంద్రబాబు తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణం అన్నారు. ప్రజలు కష్టాలున్న సమయంలో విజయవాడలో లేని వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారు….వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ధోరణిలో చంద్రబాబు తీరు ఉందన్నారు. విష క్రీడలో ఘోరాతి ఘోరంగా చంద్రబాబు ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేయించారు..ముందుగానే పట్టాభికి ఫలానా వ్యాఖ్యలు చేయాలని చంద్రబాబు సూచించారన్నారు.

చంద్రబాబు మాట్లాడే బాష ఎలాంటిది ప్రజలు చూస్తున్నారు..చంద్రబాబు ఆకస్మికంగా ఎందుకు ఎపి కి వచ్చారు…? అని ప్రశ్నించారు. తన అనుచరులు, మాజీ మంత్రులతో నీచంగా మాట్లాడుతున్నారు….వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు తీరు దారుణంగా తయారైందన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన వ్యక్తని..కుట్ర రాజకీయాలకు తెర లేపుతున్నారని ఆరోపించారు.

పట్టాభి మాట్లాడిన మాటలు కన్న తల్లులు, ఆడవారిని కించపరిచే లా లేవా…? అని ప్రశ్నించారు. మగాడి లాగా దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలిపిన శ్రీకాంత్ రెడ్డి…మీరు మాట్లాడిన పదాలు, వ్యాఖ్యలు మీకే వర్తిస్తాయి.. చంద్రబాబు కు హుందాతనం ఉంటే వెంటనే పట్టాభితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు క్షమాపణ చెప్పించాలన్నారు.

- Advertisement -