చంద్రబాబు ఏపీకి నాన్‌లోకల్‌ : సీఎం జగన్‌

114
kuppam
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ కుప్పం నియోజకవర్గంలోని అనిమిగాని గ్రామంలో మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు కుప్పంకు ఏం చేయలేదన్నారు.  కుప్పంను ఏనాడు పట్టించుకొని చంద్రబాబు కరువుకు పరిష్కారం చూపించలేకపోయారన్నారు.

చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి నాన్‌లోకల్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం హైదరాబాద్‌ను మాత్రమే లోకల్‌గా ఉంటూ ఏనాడు కుప్పంను అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల పాటు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాడని, ఏనాడైనా నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయకపోగా ప్రజల నుంచి అనేకంగా లాభపడ్డారని ఆరోపించారు.

- Advertisement -