- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705కు చేరింది. వైరస్ బారినపడిన వారిలో ఇవాళ 1081 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ బారినపడిన వారిలో ఈ రోజు వరకు 8,46,120 మంది కోలుకున్నారు. మరో 12,615 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 6,970 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 98,55,316 శాంపిళ్లు పరీక్షించినట్లు పేర్కొంది.
- Advertisement -