ఆ విషయాన్ని స్కిప్ కొట్టేసింది

74
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్ కి తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. ప్రేమమ్ , అ ఆ , శతమానం భవతి సినిమాలతో యూత్ లో ఆమె మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళం , తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ ఇటివలే కార్తికేయ 2 బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ తో కలిసి మరోసారి 18 పేజిస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్స్ లోకి రాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయింది అనుపమ. అందులో డీజే టిల్లు 2 గురించి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా స్కిప్ చేసేసింది. డీజే టిల్లు నుండి మీరు ఎందుకు బయటికి వచ్చేశారు ? మళ్ళీ ప్రాజెక్ట్ లోకి ఇన్ అనే వార్తలు వస్తున్నాయ్ నిజమేనా ? అనే ప్రశ్నలకి ఇప్పుడు 18 పేజిస్ గురించి మాత్రమే అడగండి అంటూ సరదాగా రియాక్ట్ అవుతూ ఆ సినిమా సంగతి బయట పెట్టడం ఇష్టం లేదన్నట్టుగా రియాక్ట్ అయింది. ఇక నెక్స్ట్ లైనప్ లో కూడా డీజే టిల్లు 2 టైటిల్ చెప్పకుండా స్కిప్ చేసింది కేరళ బ్యూటీ.

ఇవి కూడా చదవండి…

కనెక్ట్ పై నయనతార ముచ్చట్లు

బాలయ్యపై నయన్ షాకింగ్ కామెంట్స్‌!

హ్యాపీ బర్త్ డే…తమన్నా

- Advertisement -