రంగస్ధలం…రామలక్ష్మీ నేనే..!

230
anupama
- Advertisement -

అనుపమ పరమేశ్వర్‌..ప్రస్తుతం టాలీవుడ్ ఈ పేరునే జపం చేస్తోంది.శతమానం భవతి,ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్టైంది ఈ మలయాళ భామ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ…ఆ సినిమాతో ఈ బ్యూటీ జాతకం మారిపోయింది. టాలీవుడ్,కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనుపమ ప్రస్తుతం సాయిదరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తేజ్ ఐ లవ్ యూ సినిమాలో నటిస్తోంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఈ భామ. త్రివిక్రమ్ తన తెలుగు మాస్టర్ అని అ…ఆ సమయంలో తెలుగు నేర్పించాడని తెలిపింది. రంగస్థలం సినిమాలో రామలక్ష్మీ పాత్రకు తనను సంప్రదించారని చెప్పింది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమా చేయలేకపోయానని తెలిపింది. రామలక్ష్మీ పాత్రలో సమంత జీవించిందని…ఆ పాత్రకు తనైతేనే న్యాయం చేయగలదని తెలిపింది.

తేజ్ ఐ లవ్ యూ సినిమాని కరుణాకరన్ చాలా బాగా తెరకెక్కించాడని …సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం తనకుందని తెలిపింది. ప్రస్తుతం తనకు భాష పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఈ క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌కే దక్కుతుందన్నారు.

- Advertisement -