బీఆర్ఎస్ సభ..ఖమ్మంలో సర్వమత ప్రార్థన

59
- Advertisement -

ఇవాళ సాయంత్రం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు అనిల్ కుర్మాచలం,దూదిమెట్ల బాలరాజ్, రాజీవ్ సాగర్ సర్వమత ప్రార్థన నిర్వహించారు.

ఖమ్మంలోని సాయి బాబా మందిరం , సీ. ఏస్. ఐ చర్చ్ మరియు మసీద్ లో సర్వమత ప్రార్థనలు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ ప్రజల సంక్షేమం కోసం ముందుకువెళ్తున్న సందర్భంగా భగవంతుడు ఆశీర్వదించి, వారికి కావలసిన శక్తి యుక్తులన్నీ ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా దీవించాలని ప్రార్థించారు. ఖమ్మం సభ విజయవంతమై దేశ చరిత్రలో నూతన శకం ప్రారంభమై తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఎదగాలని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -