లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎంలు

11
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్,పినరయి విజయన్. బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో సత్కరించారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం సీఎంలు ఖమ్మంలో జరగబోయే బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -