ఏపీలో కొత్తగా 1916 కరోనా కేసులు..

179
corona
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి నిదానిస్తోంది. ఏపీలోనూ కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా పడిపోయింది. గడచిన 24 గంటల్లో 64,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,916 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 426 కేసులు రాగా, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 22 కేసులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇవే అతి తక్కువ పాజిటివ్ కేసులు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందారు. తాజాగా 3,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 8,27,882 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,98,625 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,538 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,719కి చేరింది.

- Advertisement -