గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్ శివ జ్యోతి..

556
Anchor Shiva Jyothi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో సీజన్లో భాగంగా యాంకర్ బిత్తిరి సత్తి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన యాంకర్ శివ జ్యోతి (ఇస్మార్ట్ వార్తలు సావిత్రి) ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమం చేపట్టారని.. నాకు ఈ ఛాలెంజ్ బిత్తిరి సత్తి ఇవ్వడం జరిగిందని ఆయన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు ఈ మొక్కను నాటే కార్యక్రమం చేపట్టానని తెలిపింది. అదేవిధంగా ఈ మొక్కలు పెంచే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అని తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు నాటాలని మరోక ముగ్గురికి చాలెంజ్ ఇచ్చారు. వారిలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ఆశురెడ్డి, రోహిణి ఈ ముగ్గురు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -