తెరపైకి ప్రణయ్ అమృత కేసు..అమృత సంచలన నిర్ణయం

883
Pranay_Amrutha-father_collage
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత సంవత్సరం జరిగిన పరువు హత్యలో ప్రణయ్ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అమృత తండ్రి మారుతి రావు తన అల్లుడు ప్రణయ్ ని కిరాయి హంతకులతో హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రణయ్ హత్య సమయంలో అమృత ప్రగ్నెసీతో ఉన్న విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితం అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈకేసు మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రణయ్ హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న అమృత బాబాయి తండ్రి బాబాయిలు మారుతి రావు, శ్రవణ్ కుమార్ లకు నేడు బెయిల్ మంజురైంది. మారుతిరావుకు బెయిల్ మంజూరు చేయడంపై అమృత తీవ్రంగా స్పందించింది. నిందితులకు బెయిల్ రావడంపై సుప్రింకోర్టను ఆశ్రయిస్తామని చెప్పింది.

మా నాన్న, బాబాయ్ లను నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. కోర్టులు పరువు హత్య కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. పోలీసులపై మాకు చాలా నమ్మకం ఉందన్నారు. ఈసందర్భంగా ప్రణయ్ ని హత్య చేసిన వారికి కనీసం సంవత్సరం కూడా శిక్ష పడకపోవడం బాధాకరమన్నారు.

- Advertisement -