Amit Shah:RRR టీంతో భేటీ రద్దు

43
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అమిత్ షా టూర్ షెడ్యూల్ ఖరారు కాగా తాజాగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ తో అమిత్ షా భేటీ రద్దైంది. అంతేకాకుండా బీజేపీ నేతలతో జరగాల్సిన సమావేశం కూడా రద్దైనట్లు తెలుస్తోంది.

శంషాబాద్ నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల సభ ముగియగానే అమిత్ షా తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం అమిత్ షా హైదరాబాద్ కి 3.30 గంటలకు రావాల్సి ఉంది. అయితే, సాయంత్రం 5గంటలకు రానున్నారు. గంటనర్న లేటుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందు అనుకున్న సమావేశాలు రద్దయ్యాయి.

Also Read:IPL 2023:చెన్నై, రాజస్తాన్.. జోరు కొనసాగేనా?

ఇవాళ సాయంత్రం 5 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల బహిరంగ సభకు వెళ్తారు. అక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

Also Read:ఎట్టకేలకు అమృత్ పాల్ అరెస్ట్..

- Advertisement -