రూ. 500 కోట్లతో రామాయణం..

199
Allu Arvind, Madhu Manthena, Namit Malhotra team up to bring Ramayana to big screen
Allu Arvind, Madhu Manthena, Namit Malhotra team up to bring Ramayana to big screen
- Advertisement -

వెయ్యి కోట్ల బడ్జెట్ తో మహా భారతాన్ని తెరకెక్కుతుండగా, ఇప్పుడు మరో పురాణ గాథ రామాయణాన్ని వెండితెరపై 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మాతేన సంయుక్తంగా ఈ సినిమాను త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందిస్తారట. స్వయంగా అరవిందే ఈ విషయాన్ని మీడియాకి ప్రకటించారు.

హాలీవుడ్ స్థాయిలో తీయబోయే ఈ సినిమాను ఆక్టోబర్‌ లేదా నవంబర్లో ప్రారంభం కానుందని అల్లు అరవింద్ ప్రకటించేశాడు. రామాయణం ప్రపంచానికి తెలిసిన కథే.. కానీ ఈ కథలో కథనం అండ్ విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరక్టర్ ఎవరు.. హీరో ఎవరు.. క్యాస్టింగ్ ఎవరెవరు.. అనే విషయాలు త్వరలో ప్రకటిస్తామన్నారు అల్లూ సారూ. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

- Advertisement -