కేరళ విమాన ఘటన…బన్నీ షాక్

202
bunny
- Advertisement -

కేరళ విమాన ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సినీ నటుడు అల్లు అర్జున్‌. కేర‌ళ‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం విషాదాన్ని నింపింద‌ని అన్నారు. కోజికోడ్‌లో ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మ‌ర‌ణించిన వారికి నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు బన్నీ.

కేరళలోని కోజికోడ్‌లో ఉన్న కరీపూర్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయ్‌ నుంచి వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడింది. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్‌, కోపైలట్‌ సహా 19 మంది మృతిచెందారు.

- Advertisement -