వరంగల్‌..వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరిక

134
vinay bhasker
- Advertisement -

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో రంగంపేట 27వ డివిజన్ వివిధ పార్టీల నుండి దాదాపు 200 మంది టీఆర్ఎస్‌లో చేరారు. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినయ్ భాస్కర్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే టాప్‌గా నిలిచిందని తెలిపిన వినయ్ భాస్కర్…తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ వద్దిరాజు గణేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మాలకుమ్మరి పరశురాం, ఆయేషా ఫాతిమా, గోవింద్‌ నాగరాజు, జన్ను అనిల్‌కుమార్‌, పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు దేవరకొండ సురేందర్‌, ఎండీ షఫీ, కందుల సృజన్‌కాంత్‌, మేడకట్ల సుకుమార్‌, సుంకరి రఘురాజ్‌, నీరజ, విద్య, మౌనిక, దీప్తి, తహసీన్‌, పొడిశెట్టి వాసు, పిన్నింటి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -