ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అద్వానీ..

8
- Advertisement -

అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ. ప్రస్తుతం ఎయిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఇది తనకే కాదు, తన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అద్వానీ వెల్లడించారు కూడా.

కరాచీలో జన్మించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారత్‌కు వచ్చి ముంబైలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన అద్వానీ వాజ్ పాయ్ తో కలిసి భారతీయ జనతాపార్టీని స్థాపించిన వ్యవస్థాపకులలో ఒకరు. ఏడుసార్లు లోక్‌ సభకు, ఓ సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో అద్వానీ నిర్వహించిన రథయాత్ర బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!

- Advertisement -