ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు..

182
Aditya Nath Das
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్‌దాస్ బాధ్యతల స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.

ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అజెండానే మా అజెండా అని అన్నారు. సీఎస్‌గా తనకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. సీఎం పెట్టిన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. అన్ని సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పుకొచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకే అధికారులంతా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఆదిత్యనాథ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -