‘ఆదిపురుష్’ టిక్కెట్లు ఉచితం

63
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఈనెల 16న విడుదల కానుంది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆదిపురుష్’ సినిమా టెకెట్లను 10వేలకుపైగా ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఈ టికెట్లను ఫ్రీ అందించనున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ https//bit.ly/celebratingAdipurshలో గూగు‌ల్ ఫామ్‌ని నింపితే, టికెట్లు నేరుగా పంపిస్తామని ప్రకటించారు.

అదేవిధంగా చిత్రయూనిట్ ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం ఓ సీటును ఉంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇందుకోసం చిత్రబృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఐతే, ఆ పోస్టర్‌ లో ‘దళితులకు థియేటర్లలోకి ఎంట్రీ లేదు’ అని కొందరు ఎడిట్ చేశారు. అది నెట్టింట వైరల్ ‌కావడంతో మేకర్స్ స్పందిస్తూ.. ఇది ఫేక్ వార్త అని ఎలాంటి కుల, మత, వర్ణ వివక్షను ఆదిపురుష్ చూపదని స్పష్టం చేశారు. కానీ, అప్పటికే ఈ పోస్టర్ పై బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంతకీ ఈ పోస్టర్ ను ఎవరు చేశారో తెలియాల్సి ఉంది.

Also Read:NBK 108:భగవంత్ కేసరి ఫిక్స్

ఏది ఏమైనా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని గొప్పగా నిర్మించారు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా ఈ మూవీని రూపొందించారు. అందుకే యువతీయువకులకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందని మేకర్స్ ఆకాంక్షిస్తున్నారు.

Also Read:హైదరాబాద్‌లో ‘భోళా శంకర్’

- Advertisement -