- Advertisement -
పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. మూసాపేట మండలం వేములకు లో ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మైక్రో రూరల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్లో మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్లను ప్రారంభించారు.
Also Read:KTR:రాష్ట్రంలో చెరువుల పండుగ
- Advertisement -