WHO సలహాదారుగా ఖమ్మం వాసి

23
- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్‌ అధికారి అడపా కార్తీక్‌ ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులయ్యారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కార్తీక్‌ 2007లో ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచారు. పంజాబ్‌ కేడర్‌కు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అక్కడే ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగం చేస్తున్న సమయంలోనే అమెరికాలోని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాలయంలో క్యాన్సర్‌ నిర్మూలన అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో రెండేళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకోనున్నారు.

Also Read:BJP:బీజేపీలో అధ్యక్షుల మార్పు?

- Advertisement -