గీతాంజలి మళ్ళీ వచ్చింది..ఎంజాయ్ చేస్తారు

13
- Advertisement -

హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో…

ఎడిటర్ చోటా కె.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో క్యారెక్టర్స్ భయపడుతుంటే మనం నవ్వుతుంటాం. మూవీలోని క్యారెక్టర్స్ నవ్వుతుంటే మనం భయపడుతుంటాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది’’ అన్నారు.

డైరెక్టర్ శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు నాపై నమ్మకంతో నాకు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేను. గీతాంజలి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సీక్వెల్‌ చేయటానికి కొత్త డైరెక్టర్ అవకాశం ఇచ్చిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్. అంజలిగారు, శ్రీనివాస్ రెడ్డి సహా అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సుజాత సిద్ధార్థ్, ప్రవీణ్ లక్కరాజు నా పనిని ఇంకా సులభతరం చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.

చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘సాధారణంగా మనకు సముద్రంలో ముత్యాలు దొరుకుతుంటాయి. అలా నాకు అమెరికాలో దొరికిన ఆణిముత్యాలు ప్రవీణ్ లక్కరాజు, శివ తుర్లపాటి, మా లిరిసిస్ట్ శ్రీజో వంటి వారు దొరికారు. నేను షార్ట్ ఫిలిమ్ చేసినప్పుడు నాకు శివ తుర్లపాటి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనతో జర్నీ చేస్తున్నాను. గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. ఆ సమయంలో బలుపు సినిమాలు రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆ మూవీలో కీలక పాత్ర చేసిన అంజలి పెర్ఫామెన్స్ నచ్చటంతో గీతాంజలి సినిమా కోసం అప్రోచ్ అయ్యాం. అలా సినిమా టేకాఫ్ అయ్యింది. గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గీతాంజలి మూవీ చేయటానికి మరో కారణం ఎంవీవీ సత్యనారాయణగారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ అందరూ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా గీతాంజలి. సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విషయానికి వస్తే సుజాత సిద్ధార్థ్ ఎంతో అడ్వాంటేజ్ అయ్యారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఎసెట్ అయ్యింది. ఈ సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం. సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు. భాను కిరణ్, నందు రైటింగ్ పరంగా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. సినిమాను అందరూ ఎంజాయ్ చేసి చేశారు. మా శివకు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. తను టాలీవుడ్‌లో ఫెంటాస్టిక్ డైరెక్టర్‌గా నిలుస్తారు. సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

Also Read:BJP:బీజేపీలో అధ్యక్షుల మార్పు?

- Advertisement -