శ్రావణి ఆత్మహత్య కేసు..రిమాండ్ రిపోర్ట్

402
sravani devraj
- Advertisement -

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నయా ట్వీస్ట్ ఇచ్చారు పోలీసులు. శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్,అశోక్,సాయికృష్ణ కారణమని తేల్చిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో A1 గా దేవరాజ్ రెడ్డి, A2 గా సాయి కృష్ణ రెడ్డి, A3 గా అశోక్ రెడ్డి ని చేర్చారు.తొలుత ప్రెస్ మీట్ లో A3 గా దేవ్ రాజ్ పేరు చెప్పారు కానీ తర్వాత ఏ1గా దేవరాజ్ పేరు చేర్చారు. ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించిన పోలీసులు.

కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్ రెడ్డికి ప్రపోజ్ చేసిన శ్రావణి…శ్రావణి కుటుంబసభ్యులు దేవ్ రాజ్ ను అడగడంతో ఒప్పుకోలేదని పేర్కొన్నారు.శ్రావణి దేవ్ రాజ్ ను ఒప్పించే ప్రయత్నం చేసింది అయితే సాయి కృష్ణ, అశోక్ రెడ్డి లతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవ్ రాజ్ ఒప్పుకోలేదు కానీ దేవ్ రాజ్ ను కలవడానికి శ్రావణి మెసెజ్ లు, ఫోన్ కాల్స్ తో ప్రయత్నించిందని పేర్కొన్నారు.

సాయి కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి శ్రావణి కుటుంబ సభ్యులు శ్రావణిని బెదిరించారు….సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని తీసుకెళ్లారు దేవరాజ్.ఇద్దరూ కలిసి పంజాగుట్ట శ్రీకన్య హోటల్ కి వెళ్లారు. అదేక్రమంలో 9:30pm కి శ్రీకన్య హోటల్ కు చేరుకున్న సాయి కృష్ణ రెడ్డి..శ్రావణి ని కొట్టి ఆటోలో తీసుకెళ్లి సాయి కృష్ణ,దేవ్ రాజ్ తో కలవకూడదని శ్రావణిని బెదిరించారు.

దేవరాజ్‌ని చంపేస్తా,ఆర్ధికంగా ఆదుకోమని అశోక్ బెదిరించారు. ఈ క్రమంలో శ్రావణి తో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి దేవ్ రాజ్ ఒప్పుకోలేదు. దీంతో దేవ్ రాజ్
, సాయి కృష్ణ, అశోక్ రెడ్డి ల వేదింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటికే ఏ1,ఏ2లను అరెస్ట్ చేయగా A3 అశోక్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -