మొక్కలు నాటిన నటి పొట్టి విజయ…

385
vijaya
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఆర్టిస్ట్ పొట్టి విజయ….అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని ఆర్టిస్ట్ పొట్టి విజయ అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.నటుడు సాకేత్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన నివాసంలో లో మూడు మొక్కలు నాటింది.అనంతరం మరో ముగ్గురు ( నటి సంజన , జబర్దస్త్ నటులు పవన్ , వినోద్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని ఆర్టిస్ట్ పొట్టి విజయ పిలుపునిచ్చారు.

- Advertisement -