డ్రగ్స్ వ్యవహారంలో స్టార్‌ కపుల్..

231
Sandalwood drug case
- Advertisement -

కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. హీరోయిన్లు రాగిణి ద్వివేది సంజన గల్రానీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా వారు ఈ వ్యవహారంలో భాగస్వాములైన సినీ రాజకీయ అధికార ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో కన్నడ స్టార్ కపుల్ దిగంత్, ఐంద్రితలకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు.

ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీని ఆధారంగా వీరికి సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు రెయిడ్ చేశారు. అయితే ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -