మహిళపై పోలీసులకు విశాల్ ఫిర్యాదు…

160
vishal
- Advertisement -

తన ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో పనిచేసే మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాల్. ఆరేళ్లుగా తన దగ్గరి నుండి రూ. 45లక్షలకు పైగా మోసం చేసి సంపాదించిందని ఆ డబ్బుతో ఇల్లు కూడా కొనుక్కుందని చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విశాల్ మేనేజర్ హరి.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆమెపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న విశాల్…హీరోగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు.

తన సొంత బ్యానర్‌ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు. ప్ర‌స్తుతం విశాల్ చ‌క్ర అనే సినిమాలో న‌టిస్తుండ‌గా, ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో రూపొందుతుండ‌గా సమాజంలో డిజిటల్ అవినీతి , హ్యాకింగ్ అంశాల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -