శ్రీవారి సన్నిధిలో మేయర్ బొంతు..

176
bonthu rammohan
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించారు.

తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి ఆశిస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు బొంతు రామ్మోహన్. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్‌కు ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి పట్టు వస్ర్తాలను ప్రదానం చేశారు.

- Advertisement -