మొక్కలు నాటిన రేడియో జాకీ కాజల్

222
radio
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా రేడియో జాకీ చైతు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన రేడియో జాకీ కాజల్.

ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారని మనందరం కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాలుష్యం లేని దేశంగా పచ్చని భారతదేశం గా చేయాలని కోరారు.

అదేవిధంగా చాలెంజ్ ను ఈ వీడియో చూసి అందరూ కూడా తమ తమ బాధ్యతగా ఎక్కడ ప్రదేశం ఉంటే అక్కడ ఇంట్లో గాని పార్క్ లో గాని బయట ప్రదేశాల్లో గాని ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు నాటాలని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా నా స్నేహితురాలు లిప్సిక గాయని , అలీ రేజా బిగ్ బాస్2, సుష్మ కిరణ్ నటీ లను ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -