భారత సైన్యానికి 117 ఎకరాల భూమి విరాళంపై స్పందించిన సుమన్..

59
- Advertisement -

సినీ నటుడు సుమన్ భారత సైన్యానికి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించారు.

‘‘సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. ఈ వివాదానికి సంబంధించిన పరిష్కారం లభించిన వెంటనే.. స్వయంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను. దయచేసి అప్పటి వరకు ఇటువంటి వార్తలను నమ్మవద్దు..’’ అని సమన్‌ తెలిపారు.

- Advertisement -