టీడీపీ నేత వంగలపూడి అనితపై ఎమ్మెల్యే రోజ ఫైర్‌..

55
- Advertisement -

మహిళా సమస్యలపై పోరాడేటప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలో వైసిపి మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా నగరిలో చేపట్టిన “క్యాండిల్ ర్యాలీ” చూస్తే అర్థమౌతుంది!. ఒక ఆడబిడ్డ చనిపోతే ఆమె స్పందించిన తీరు, ఈ సందర్భంగా ఆడవారి సమస్యలపై ఆమె మాట్లాడిన మాటలు, ధైర్యం చెబుతూ చేసిన ప్రసంగం చూస్తే ప్రతి ఒక్కరికీ మహిళలంటే గౌరవం, సానుభూతి కలిగించింది.

కాగా, అదేరోజు.. గుంటూరులో తెలుగు దేశం మహిళా నేత వంగలపూడి అనిత మహిళలతో తెలుగుదేశం నేతలకు మద్దతుగా చేపట్టిన “నారీ సంకల్ప దీక్ష”ను చూస్తే ఇది మహిళల కోసం చేసే నిరసన కార్యక్రమమా? లేక మహిళలు చేసే రికార్డు డాన్సా అని అసహ్యం వేస్తోంది! ఒక ఆడబిడ్డ అన్యాయంగా చనిపోతే సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి సంతోషంగా తైతక్కలాడుతున్న వీరి నిరసన కార్యక్రమం చూస్తే మహిళాలోకం సిగ్గుతో తలదించుకొనేలా ఉంది. ఎవరి సంస్కారం ఎలాంటిదో వీరిని చూసి అర్థం చేసుకోండి! అని నగిరి ఎమ్మెల్యే రోజా తెలిపారు.

- Advertisement -