మొక్కలు నాటిన యాక్టర్ సాయి సుశాంత్ రెడ్డి…

448
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అభినవ్ గోమటం విసిరిన చాలెంజ్ ను స్వీకరించి తన నివాసం జూబ్లీ హిల్స్ లో మూడు మొక్కలు నాటారు యాక్టర్ సాయి సుశాంత్ రెడ్డి.

ఈ సందర్భంగా సాయి సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకు పోతున్నారని దానిలో భాగంగా నేను కూడా మిత్రుడు అభినవ్ గోమటం ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం జరిగిందన్నారు.

అదేవిధంగా తను మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ఇస్తున్నట్టు చెప్పారు.ప్రముఖ సింగర్ మనీషా ఎర్రబత్తిని, చాందిని చౌదరి,అలాగే వెంకటేష్ కాకమనులను మూడు మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమవంతు పాత్ర పోషించాలన్నారు.

- Advertisement -