- Advertisement -
టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం టాలీవుడ్ నటుడు నవదీప్ను ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. దాదాపు 9 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈడీ అధికారులు నవదీప్ను అనేక కోణాల్లో ప్రశ్నించారు. ముఖ్యంగా, డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్తో లావాదేవీలపైనే ఈడీ అధికారులు నవదీప్ను ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర అంశాలపై సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ విక్రమ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. హైదరాబాదులోని ఎఫ్ క్లబ్ మాదకద్రవ్యాల అడ్డాగా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ క్లబ్ నవదీప్ సొంత పబ్ అని తెలిసిందే.
- Advertisement -