గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన నటి కనకదుర్గమ్మ..

117
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గృహాలక్ష్మి సీరియల్ నటి పూజితరెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటారు నటి కనకదుర్గమ్మ. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని కనకదుర్గమ్మ అన్నారు. అనంతరం నటీమణులు రాగిణీ, నవీనారెడ్డి, నటుడు టార్జాన్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -