చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత: జూనియర్ పాల్

228
Actor Junior Paul
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆర్టిస్ట్ జూనియర్ పాల్ రాము మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సింగర్ సత్యభామ స్వాతి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఖైరతాబాద్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.అనంతరం మరో ముగ్గురు ( ఆర్టిస్ట్ లు అంబటి శ్రీను , దాని ఎలీ , జబర్దస్త్ నాగ తేజ్ )లు కూడా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటాలని ఆర్టిస్ట్ జూనియర్ పాల్ రాము పిలుపునిచ్చారు.

- Advertisement -