మొక్కలు నాటిన నటుడు జోష్‌ రవి..

279
josh ravi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటాడు టాలీవుడ్‌ నటుడు జోష్‌ రవి. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటనని ఆర్టిస్ట్ రవి అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నటుడు అనంత్ బాబు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మధుర నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు జోష్‌ రవి. అనంతరం మరో ముగ్గురు( ఆర్టిస్ట్ లు సప్తగిరి , పమ్మి సాయి , ధర్మ )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -