కొత్త రెవెన్యూ చట్టంతో నవశకానికి నాంది: మంత్రి హరీష్‌

221
Minister Harish Rao
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ విధానంలో అనేక సంస్కరణలతో నూతన రెవెన్యూ చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వీఆర్వో వ్యవస్థను కూడా రద్దు చేసింది. ఈ చట్టం నేడు అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌ రావు స్పందించారు.

అవినీతి, ఆలస్యం బాధల నుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది. రెవెన్యూలో సిఎం కేసిఆర్ చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కి కృతజ్ఙతలు అంటు ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -