ఆప్ సర్కార్‌ని చీల్చేందుకు బీజేపీ కుట్ర..!

60
- Advertisement -

ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపించారు. లిక్కర్ స్కాం ఆరోపణలు, ఈడీ రైడ్స్ జరుగుతున్న తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయితే ఈ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో రాజకీయవర్గాల్లో ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.

సొంతపార్టీలోనే తిరుగుబాటు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని ఆప్ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆరోపణలు చేసింది. సీబీఐ, ఈడీ ద్వారా… కేజ్రీవాల్ సర్కార్ ను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆప్ నేతలు తెలిపారు.

- Advertisement -