కేజ్రీవాల్ పై మరో సారి దాడి..ఈసారి చెంప చెల్లుమంది(వీడియో)

270
Kejriwal
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన ఢిల్లీలోని మోతీనగర్ లో జరిగిన రోడ్ షో లో పాల్గోన్నారు. ప్రచారంలో భాగంగా వాహనంపైనుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న కేజ్రీవాల్ ను గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆయన చెంపపై గట్టిగా కొట్టారు.

అనంతంర ఆ వ్యక్తని పట్టుకుని చితకబాదారు ఆప్‌ కార్యకర్తలు. ఈ ఘటనతో కేజ్రీవాల్ తో పాటు అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఆప్ కార్యకర్తలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై గతంలోనూ అనేక సందర్భాల్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఇంతకుముందు ఇంక్, చెప్పులతోనూ దాడులకు పాల్పడ్డారు. మరోసారి కారం పోడితో సెక్రటేరియట్ తో దాడికి పాల్పడ్డారు. కేజ్రీవాల్ పై మొత్తం 8సార్లు జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఒక సీఎం పై ఇన్ని సార్లు దాడులు జరగడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు..

- Advertisement -