కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఆంధ్ర‌పాల‌న వ‌స్తుందిః ఎంపీ క‌విత‌

234
mp kavitha
- Advertisement -

రాష్ట్రంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌చార హోరు ఉపందుకుంది. ఇరు పార్టీల నేత‌లు గ్రామాల్లో ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈసంద‌ర్భంగా ఇవాళ ఎంపీ క‌విత ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ అభ్య‌ర్ధి జీవ‌న్ రెడ్డి కి మ‌ద్ద‌తుగా రోడ్ షో నిర్వ‌హించారు. పొర‌పాటున కూట‌మి అధ‌కారంలోకి వ‌స్తే మాత్రం తెలంగాణ‌లో పాల‌న ఆంధ్ర‌వాళ్లు నుంచి సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నేత‌లంతా అమ‌రావ‌తికి వెళ్లి డిషిష‌న్ లు తీస‌కునే ప‌రిస్ధితి వ‌స్తుంద‌న్నారు. కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ అభివృద్ది వైపు దూసుకెళ్తుంద‌న్నారు.

kavitha

రైతుల‌కు 24గంట‌ల క‌రెంట్ ఇచ్చిన ఘ‌నత ముఖ్య‌మంత్రి కేసీఆర్ కే చెందుతుంద‌న్నారు. రైతుల సంక్షేమ‌మే టీఆర్ఎస్ ఎజెండా అన్నారు. తెలంగాణ‌లో సంక్షేమం ఆగిపోకుండా ఉండాలంటే తిరిగి టీఆర్ ఎస్ పార్టీ అధ‌కారంలోకి రావాల‌ని తెలిపారు. మ‌ళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామ‌న్నారు. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జీవ‌న్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు ఎంపీ క‌విత‌

- Advertisement -