సంచలనాలకు మారు పేరైనా రాంగోపాల్ వర్మ సరికొత్త ప్రయత్నం వేదికగా అడుగులేస్తున్నాడు. సినిమాపై అభిమానంతో దర్శకుడిగా మారి తన స్టైల్లో చిత్రాలు తెరకెక్కిస్తూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘శివ’ సినిమాతో టాలీవుడ్కు దర్శకుడి అవతారమెత్తిన ఆయన ఎన్నో సినిమాలు చేసి టెక్నాలజీలతో పాటు డిఫరెంట్ టేకింగ్ పరంగా దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ను సృష్టించుకున్నాడు.
ఇక విషయమేమిటంటే సినిమా పిచ్చితో టాలీవుడ్, బాలీవుడ్లో అనేక సినిమాలు రూపొందించిన ఆయన ఓ ఫిల్మ్ స్కూల్ స్థాపించే దిశగా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. న్యూయార్క్ కు చెందిన డాక్టర్ రామ్ స్వరూప్, డాక్టర్ శ్వేతా రెడ్డిలతో కలిసి ‘ఆర్జీవీ అన్స్కూల్’ పేరుతో ఫిలిం స్కూల్ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక వర్మ ప్రస్తుతం కింగ్ నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నాగ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో నాగార్జున్-వర్మ కాంబినేషన్లో వచ్చి చిత్ర పరిశ్రమలో సెన్సేషన్గా మారింది ‘శివ’. మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న ఆఫీసర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 1న రిలీజ్కు రెడీ అవుతోంది.