మ‌హేశ్ బాబుకు అప్పుడు ఒక్క‌రే..ఇప్పుడు 8 మంది..

279
mahesh_ babu
- Advertisement -

తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకు తెలుగు రాష్టాల‌లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. తెల‌గు ఇండ‌స్ట్రీలో టాప్ రేంజ్ లో కొన‌సాగుతున్నాడు మ‌హేశ్ బాబు. మ‌హేశ్ బాబు తాజాగా న‌టించిన చిత్రం భ‌ర‌త్ అనే నేను. ఈచిత్రం భారీ విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త‌మిళ్ , కర్ణాట‌క లో కూడా మ‌హేశ్ బాబుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. భ‌ర‌త్ అనే నేను సినిమా మే31 వ తేదిన భ‌ర‌త్ ఎనుము నాన్ పేరుతో త‌మిళంలో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. త‌మిళంలో కూడా మ‌హేశ్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉండటంతో అక్క‌డ విడుద‌ల చేస్తున్నట్లు తెలిపారు.

mahesh babu

మహేశ్ బాబు సినిమాల‌లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడ‌నే విష‌యం తెలిసిందే. ఎదైనా విష‌యం గురించి మాట్లాడ‌ల‌నుకుంటే తాను ట్వీట్ట‌ర్ నుంచి కామెంట్ చేస్తారు. ట్వీట్ట‌ర్ లో మ‌హేశ్ బాబుకు 65ల‌క్ష‌ల‌మందికి ఫాలోవ‌ర్స్ ఉన్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ లో అతిఎక్కువ మంది ఫాలోవ‌ర్స్ లిస్ట్ లో మ‌హేశ్ బాబు కూడా ఒక‌రు. భ‌ర‌త్ అనే సినిమాకు ముందు వ‌ర‌కూ మ‌హేశ్ బాబు కేవ‌లం త‌న బావ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ను మాత్ర‌మే ఫాలో అయ్యేవాడు. భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత మ‌రికొంత మంది ఫాలో అవుతున్నాడు మ‌హేశ్ బాబు.

mahesh babu twitter

భ‌ర‌త్ అనే నేను సినిమా ఘూటింగ్ నుంచి కొర‌టాల శివ‌ను ఫాలో అవుతున్నాడు మ‌హేశ్ బాబు. ఇక తాజాగా మ‌రో ఆరుగురిని త‌న లిస్ట్ లో చేర్చుకున్నాడు సూప‌ర్ స్టార్. ఈలిస్ట్ లో క్రికెట్ దేవుడు, భార‌తర‌త్న స‌చిన్ టెండుల్క‌ర్, ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లి, ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి, తెలంగాణ మంత్రి కేటీఆర్, రైట‌ర్ టోనీ రాబిన్స్ ను త‌న ఫాలోయింగ్ లిస్ట్ లో చేర్చుకున్నాడు. అప్పుడు ఒక్క‌రినే ఫాలో అయిన మ‌హేవ్ ఇప్ప‌డు 8మందిని ఫాలో అవుతున్నాడు. రానున్న రోజుల్లో ఇంకెవ‌రి ఫాలో అవుతాడో వేచి చూడాలి. ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను సినిమాను ఎంజాయ్ చేస్తున్నాడు మ‌హేశ్. త‌న ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ లో స‌ర‌దాగా స‌మ్మ‌ర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మ‌హేశ్ బాబు త‌ర్వాతి చిత్రం వంశీ పైడిపెల్లితో చేయ‌నున్నారు.

- Advertisement -