సీఎం విజయ్‌పై ఉదయనిధి ఫైర్

3
- Advertisement -

చెన్నైలోని తిరువొత్తియూర్‌లో ఓ యువకుడి దారుణ హత్య ఉదంతంపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్‌ను తీవ్రంగా నిలదీశారు. బాధితుడు తనకు పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయని, వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరినప్పటికీ అతడు నరికివేతకు గురయ్యాడని ఆరోపించారు.

రాజధాని నగరం చెన్నైలో మరొక దారుణమైన హత్య జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని ఉదయనిధి పేర్కొన్నారు. పోలీసు రక్షణ కోరుతూ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే నరికి చంపబడిన 26 ఏళ్ల ప్రదీప్‌రాజ్ హత్యను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన మరణానికి ముందు ప్రదీప్‌రాజ్ ఒక వీడియోను విడుదల చేశాడని ఉదయనిధి తెలిపారు. ఆ వీడియోలో తిరువొత్తియూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తనను బెదిరిస్తూ… నువ్వు బ్రతకవు… నిన్ను ప్రమోట్ చేసి అబద్ధపు కేసులో ఇరికించి జైల్లో పెడతాను” అని బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా, “నువ్వు కావాలంటే పోయి సీఎంకు చెప్పుకో, నన్నెవరూ ఏమీ చేయలేరు అని కూడా ఇన్‌స్పెక్టర్ అన్నాడని ప్రదీప్ తెలిపాడు.

శాంతిభద్రతల శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రిని, పోలీసులే ఒక డమ్మీ సీఎంగా భావిస్తున్నారా?” అని ఉదయనిధి ప్రశ్నించారు. పోలీసు రక్షణ కోరే పౌరులే చివరకు హత్యకు గురయ్యేలా ఈ ప్రభుత్వం ఒక కొత్త ఆనవాయితీని తీసుకొచ్చింది అని మండిపడ్డారు. అసెంబ్లీలో శాంతిభద్రతలపై ప్రశ్నించినప్పుడు పాత విషయాలను ప్రస్తావిస్తూ దాటవేసే ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ హత్యకు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. తిరువొత్తియూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి, వారికి తగిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:బిగ్ బాస్ హౌస్ గోడ దూకిన కంటెస్టెంట్!

- Advertisement -