తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిని కాంక్షిస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 4,800 కోట్లతో భారీ తాగునీటి పథకాలను ప్రకటించడంతో పాటు గతంలో వివిధ నిరసనల్లో పాల్గొన్న రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా రూ. 4,800 కోట్ల అంచనా వ్యయంతో కొత్త తాగునీటి పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
తమ న్యాయమైన డిమాండ్ల కోసం గతంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన రైతులు మరియు ఉపాధ్యాయులపై నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వివిధ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ నిర్ణయాలే నిదర్శనమని సీఎం విజయ్ పేర్కొన్నారు.
Also Read:ఇరాన్తో చర్చలు లేవు:ట్రంప్

