అబూబకర్ వ్యాఖ్యలపై సతీశన్ ఫైర్

0
- Advertisement -

మహిళలు నాలుగు గోడలకే పరిమితం కాకూడదని, సమాజంలో ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రతి రంగంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని కేరళం సీఎం వి.డి. సతీశన్ స్పష్టం చేశారు. మహిళలపై ఆంక్షలు విధించేలా, వారు ఇళ్లకే పరిమితం కావాలంటూ సున్నీ ఇస్లామిక్ పండితుడు కాంతాపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కాకూడదని, విద్యా, ఉద్యోగ, సామాజిక మరియు రాజకీయ రంగాలలో చురుగ్గా పాల్గొనాలని వి.డి. సతీశన్ అన్నారు. కేరళం వంటి పురోగమిస్తున్న సమాజంలో మహిళల స్వేచ్ఛను, వారి భాగస్వామ్యాన్ని హరించేలా మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Also Read:IRGC:రెండోరోజు వైమానిక దాడులు

సమాజ అభివృద్ధికి పురుషులతో పాటు మహిళలు సమానంగా కష్టపడాలని, వారి అభివృద్ధిని అడ్డుకునేలా చేసే ప్రకటనలు ఆధునిక కాలానికి తగవని స్పష్టం చేశారు.

- Advertisement -