పసుపు శతాబ్దాలుగా సాంప్రదాయ వంటకాలలో, వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగ ఉంది. దీనిలో ఉన్న ‘కర్కుమిన్’ అనే సహజ కాంపౌండ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజూవారీ ఆహారంలో పసుపును చేర్చుకోవడానికి గల ముఖ్యమైన కారణాలను పరిశీలిస్తే..
మంట/వాపును తగ్గించడంలో సహాయపడుతుంది .యాలు లేదా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు శరీరం ప్రతిస్పందించే క్రమంలో వాపు/మంట కలగడం సహజం. అయితే, ఇది దీర్ఘకాలం ఉంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పసుపులోని కర్కుమిన్ శరీరంలోని సహజ ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనకు మద్దతుగా పనిచేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
కాలుష్యం, సూర్యరశ్మి మరియు సాధారణ జీవక్రియల వల్ల శరీరం ఫ్రీ రాడికల్స్కు గురవుతుంది. పసుపులో లభించే యాంటీఆక్సిడెంట్లు కణాలను ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ నుండి కాపాడతాయి. రోజూ పసుపు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది కీళ్లను ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవడానికి చాలామంది ఆహారంలో పసుపును భాగం చేసుకుంటారు. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం అందించడంలోనూ, కీళ్ల కదలికలను మెరుగుపరచడంలోనూ కర్కుమిన్ కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read:వర్షాలతో అలెర్జీ..వీటితో చెక్!
పసుపు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది పిత్త రసం ఉత్పత్తిని ప్రోత్సహించి కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. సూప్లు, కూరలు లేదా వేడి పాలలో పసుపును కలిపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
పసుపు వల్ల వంటకాలకు మంచి రంగు, రుచి వస్తాయి. విశేషమేమిటంటే దీనిలో క్యాలరీలు దాదాపు సున్నా. రోస్ట్ చేసిన కూరగాయలు, పులుసులు లేదా సూప్లలో పసుపు చల్లడం ద్వారా ఆహారాన్ని పోషక విలువలతో పాటు రుచిగా మార్చుకోవచ్చు.

