వైద్య విధాన పరిషత్ (TVVP) పరిస్థితి కమిషనర్ లేక గాలిలో దీపంలా మారడం శోచనీయం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో TVVP పరిధిలోని ఎంసిహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీ మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది అన్నారు.
ఆసుపత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యత తదితర అంశాలను పర్యవేక్షించే అధికార యంత్రాంగమే లేకుండా పోయింది.దీంతో ఒకవైపు వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు ప్రజలు సరైన వైద్య సేవలు అందక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.
వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో TVVPని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయాలని గతం బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం, లక్ష్యం కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరం. దీంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఇదే విషయమై ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోతుంది. రోడ్లెక్కి నిరసనలు తెలియచేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం.వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కు సంబంధించి వెంటనే కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:ICC:అఖిలేష్ రెడ్డిపై నిషేధం

