ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఆగస్టు 15 నుండి గాల్ అంతర్జాతీయ స్టేడియంలో మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరం కావడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ప్రారంభంలో శ్రీలంక సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో బుమ్రా పేరు ఉన్నప్పటికీ ఆయన ఆడటం ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ఆయన ఫిట్నెస్ టెస్ట్ ఉత్తీర్ణులయ్యారని ఆడటానికి అందుబాటులో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆగస్టు 2న 32 ఏళ్ల బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యారని తేలింది.
రెండు టెస్టుల సిరీస్ దగ్గర పడుతుండటంతో బీసీసీఐ వెంటనే స్పందించి బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఫామ్లో ఉన్న పేసర్ ఆకిబ్ నబీని జట్టులోకి ఎంపిక చేసింది.గత రెండు సీజన్లుగా దేశవాళీ (డొమెస్టిక్) క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆకిబ్ నబీ భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఆయన 2025-26 రంజీ ట్రోఫీ సీజన్లో మొత్తం 60 వికెట్లు తీసి, జమ్మూ కాశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
భారత టెస్ట్ జట్టు:
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరన్ష్ జైన్, ఆకిబ్ నబీ.
Also Read:సండే స్పెషల్..వెజ్ బర్గర్ వంటకాలు

