పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నేడు లోక్సభ మరియు రాజ్యసభల్లో పలు కీలక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నీట్ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనలు మరియు ప్రజా పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా రాజకీయ కాక రేగింది.
లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరీక్షల వ్యవస్థను సంస్కరించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యులను ఎద్దేవా చేస్తూ ప్రియాంక గాంధీ వాద్రా కొత్త సవరణలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో బుధవారం దిగువ సభలో (లోక్సభ) మాట్లాడటం ప్రారంభించిన రాహుల్ గాంధీ…కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించడం లోక్సభలో తీవ్ర కలకలానికి దారితీసింది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు….రాహుల్ గాంధీ ఉపయోగించిన పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆ పదాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించలేదని స్పష్టం చేసిన రాహుల్…వాటిని సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు.
Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన
దీనిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జోక్యం చేసుకుని, కాంగ్రెస్ నేత తన ప్రసంగాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని అధికార పక్ష సభ్యులను కోరారు. అలాగే అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఓం బిర్లా ఈ విజ్ఞప్తిని స్వీకరించి ఆ వ్యాఖ్యలను సభా రికార్డుల నుండి తొలగించారు.

